Surya Kiran : తన భార్య కళ్యాణి గురించి డైరెక్టర్ సూర్యకిరణ్ మాట్లాడిన ఆఖరి మాటలివే

- Advertisement -


Surya Kiran : చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి చెందాడనే వార్త ఇండస్ట్రీలో అందరిని షాక్ గురి చేసింది. గత కొంతకాలంగా ఆయన పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సూర్య కిరణ్ మృత్యువాత పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక బాల నటుడుగా కిరణ్ దక్షిణాదిలో 200 ల సినిమాల్లో నటించారు. తర్వాత ‘సత్యం’ అనే సినిమాతో డైరెక్టర్ గా మారి భారీ సక్సెస్ అందుకున్నారు.. ఆ తర్వాత ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’ , ‘రాజుభాయ్’ వంటి సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ఇష్టపడి మరి ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో త్వరలోనే విడాకులు తీసుకున్నారు. తన సినిమాలు ఫ్లాప్ అవడంతో వైవాహిక జీవితంలో కూడా పలు ఇబ్బందులు వచ్చాయట. దీంతో మానసికంగా కృంగిపోయి కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్య కిరణ్. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఎవరికి కనిపించలేదు.

అయితే అనారోగ్యం బారిన పడక ముందు ఓ తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్. తన భార్య కిరణ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన మాటలు కంటతడి పెట్టించాయి. ‘కళ్యాణి నాకు అమ్మ తర్వాత అమ్మ. ఆమెని రోజు మిస్ అవుతూనే ఉంటాను. కళ్యాణి లేని లోటు తన జీవితంలో ఎవరు భర్తీ చేయలేరు. నేను తనకి అవసరం లేకపోవచ్చు నాకైతే ఆమె లేని లోటు చాలా కనిపిస్తుంది. మా ఇద్దరినీ విడాకులు వేరు చేసిన మమ్మల్ని మాత్రం దూరం చేయలేదు. ఈ జన్మకే కాదు ఇంకెన్ని జన్మలెత్తినా కూడా కళ్యాణినేదే నా భార్య స్థానం. ఇప్పటికి కూడా నా మొబైల్ లో లాప్టాప్ లో ఆమె ఫోటోనే ఉంటుంది’ అంటూ చాలా బాధాతప్త హ‌ృదయంతో మాట్లాడారు కిరణ్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here