Kalpana Rai : కూతురు మోసం చెయ్యడంతో కల్పన చివరి రోజుల్లో అన్ని కష్టాలను అనుభవించిందా..!

- Advertisement -

Kalpana Rai : ఒకప్పుడు తన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ కల్పనా రాయ్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. భారీ ఆకారంతో ఆమె పేల్చే జోకులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి.. తనదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్ తన యాస్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది.. అలాంటి నా అనుకున్న వాళ్లు మోసం చెయ్యడం వల్ల చివరి రోజుల్లో కష్టాలను అనుభవించి చనిపోయిందని చాలా మందికి తెలియదు..

kalpana rai
kalpana rai

ఈమె తెలుగుతో పాటు వేరే బాషల్లో కూడా సినిమాలు చేసింది.. 435 కు పైగా సినిమాలు చేసింది.. అందులో జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి సినిమాలు ఆమెకు మంచి పేరును అందించాయి.. ఈమె కాకినాడలో జన్మించింది.. నీడలేని ఆడది సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత లేడి కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. అయితే ఎంత సంపాదించిన అందులో కొంత తన చుట్టు పక్కల వారికి సాయం చేసేది. ఆమె మంచితనమే ఆమెకు శాపంగా మారింది.. ఆస్తి పోయాక అందరు దూరం అయ్యారు..

- Advertisement -

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు కూడా చివరి రోజుల్లో ఆమె కనీసం చూడలేదట.. దత్తత తీసుకొని పెంచుకున్న కూతురు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.. ఆ సమయంలో కల్పనా రాయ్ చాలా క్షోభకి గురైంది. ఇక ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బులు అన్ని ఆవిరి అయ్యాయి. చనిపోయేముందు చాలా రోజులు తిండిలేక ఆకలితో అలమటించింది.. చివరికి మృతి చెందింది.. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సమయంలో మా మూవీ అసోసియేషన్ ముందుకు వచ్చి ఈమె అంతక్రియలను జరిపించినట్లు తెలుస్తుంది.. కూతురు దూరం అయ్యిందనే బాధ ఆమెను మానసికంగా భాధించింది.. అలా ఆమె చివరి రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోయారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here