Nagarjuna : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ని కలిపింది నాగార్జునా ?.. ఇన్ని రోజులకు బయటపడ్డ సీక్రెట్

- Advertisement -

Nagarjuna : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెబితే చాలు యూత్‌లో విప్లవం మొదలవుతుంది. ఇక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం మొదలు అవుతుంది. ఆయన నటించిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి, జల్సా లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ చాలా మందికి అమితమైన ఇష్టం. ఇందులో కొన్ని సినిమాలు మళ్లీ రీ రిలీజ్ అయి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. మే 13న జరిగిన ఎన్నికలు అయిపోవడంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. నాగార్జున తీసుకున్న ఓ నిర్ణయం పవన్ కళ్యాణ్‌ జీవితాన్నే మార్చిందట. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో బద్రీ మూవీ ఎంత పెద్ద సక్సెస్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతే కాకుండా ఈ సినిమాతోనే పవన్‌ కళ్యాణ్ కు రేణుదేశాయ్ కూడా పరిచయమైంది. ఈ సినిమాను డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు.

- Advertisement -

Akkineni Nagarjuna

అయితే మొదట ఈ సినిమా కథను నాగార్జునకు వినిపించగా ఆయన ఒకే చెప్పాడంట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆయన రిజక్ట్ చేశాడట. తర్వాత ఇదే కథను పవన్‌ కళ్యాణ్ కు వినిపించడంతో ఆయన ఒకే అన్నాడట. ఇక ఇందులో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని రేణు దేశాయ్‌ను తీసుకున్నారు. ఈ సినిమాతోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, చివరికి సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలను కన్నారు. కానీ వీరు ఇప్పుడు డివోర్స్ తీసుకుని విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతున్నారు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను కలిపింది నాగార్జునే, ఆయనే కనుక సినిమాను రిజక్ట్ చేయకపోతే, రేణు పవన్‌కు పరిచయం కాకపోయేది, వీరిద్దరి మధ్య లవ్, డివోర్స్ ఏవీ ఉండకపోయేవని అంటున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here