Niharika Konidela : భర్తకు విడాకులు ఇచ్చి.. లవ్ యానివర్సరీ చేసుకుంటున్న నిహారిక

- Advertisement -

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్లలో నిహారిక ఒకరు. నిహారిక, చైతన్య పెళ్లి, విడాకుల వ్యవహారాలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌ అయిన సంగతి తెలిసిందే. కరోనా టైంలో రాజస్థాన్‌లో పెళ్లి జరగడం, సరిగ్గా రెండేళ్లు తిరక్కుండానే డివోర్స్ తీసుకోవడం.. ఇప్పుడు ఎవరి దారి వారిదే అంటూ బతికేస్తున్నారు. ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. పెళ్లి నాటి గుర్తుల్ని, ఫోటోలను డిలీట్ చేశారు.

Niharika Konidela
Niharika Konidela

చైతన్యకు విడాకులు ఇచ్చి నిహారిక ప్రస్తుతం ఒంటరిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. నిర్మాతగా మారి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తోంది. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. నిహారిక నిత్యం తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కొద్ది కాలంగా నిహారిక ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతోంది. వాటి కారణంగా ఒక్కోసారి ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ అలాంటి వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చిందే చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

- Advertisement -

‘డెడ్ పిక్సల్’ వెబ్ సిరీస్ విడుదలై ఏడాది పూర్తయినట్లు తెలుపుతూ నటుడు అక్షయ్ పెట్టిన పోస్ట్‌ను మళ్లీ షేర్ చేసింది. అందులో డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ పోస్టర్‌తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఉంది. ‘‘ నా ఫస్ట్ లవ్‌కు ఏడాది పూర్తి అయింది. లవ్ అంటే రెడ్ కలర్ హార్ట్ కాదు, లవ్ అంతే. థాంక్యూ ఆదిత్య మండల’’ అని రాసి ఉంది. అలాగే మేలో మళ్లీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ గత ఏడాది మే 19న డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here