Pooja Hegde : పెను ప్రమాదం నుండి తప్పించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే..లక్ అంటే ఇదే!

- Advertisement -

Pooja Hegde వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతూ నెంబర్ 1 హీరోయిన్ అనిపించుకున్న పూజా హెగ్డే అకస్మాత్తుగా ఈమధ్య సినిమాలు చెయ్యడం తగ్గించే లోపు ఆమె కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. చివరిసారిగా ఆమె తెలుగు లో చేసిన రెండు చిత్రాలు ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళం లో ఆమె విజయ్ తో కలిసి చేసిన ‘బీస్ట్’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

అప్పటి వరకు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న విజయ్ లాంటి హీరో కి కూడా ఈమె ఫ్లాప్ ఇచ్చేలోపు దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేసేందుకు భయపడ్డారు. కేవలం తెలుగు, తమిళం లో మాత్రమే కాదు, హిందీ లో కూడా ఈమె చేసిన ‘సర్కస్’, ‘కేసీ కా భాయ్..కేసీ కా జాన్’ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఇలా రీసెంట్ గా ఆమె ముట్టుకున్న ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుండడం తో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తనని బాగా హైలైట్ చేసే స్క్రిప్ట్ వచ్చే వరకు అనే ధోరణితో ఆమె ఉంది. అందులో భాగంగానే ఆమె ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. కథలో తనకి ప్రాముఖ్యత లేదని గమనించిన పూజా హెగ్డే వెంటనే ‘గుంటూరు కారం’ నుండి తప్పుకుంది. ఆ క్యారక్టర్ ని శ్రీలీల చేసింది.

- Advertisement -

ఆమె పాత్ర కి ఎంత నెగటివ్ రివ్యూస్ వచ్చాయో మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమా నుండి బయటకి వచ్చి పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే పూజ హెగ్డే కెరీర్ కి శాశ్వతంగా ఎండ్ కార్డు పడేది అని , ఆమెతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదని అంటున్నారు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here