Shruthi Sharma : ఆ హీరోతో రొమాన్స్ తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్ సెన్సేషన్ కామెంట్స్

- Advertisement -

Shruthi Sharma : బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మనీషా కొయిరాలా, సోనాక్షీ సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ వంటి వారు కీలకపాత్రలు పోషించారు. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పాకిస్తాన్ లోని వేశ్య గృహాల్లోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా పాలుపంచుకున్నారనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రస్తుతం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం నెట్‏ఫ్లీక్స్ ఓటీటీలో అత్యధిక వ్యూస్‏తో దూసుకుపోతుంది హీరామండి. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమా హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్ లో సైమా అనే పాత్రలో నటించింది. సైమా పాత్రలో శృతి ఒదిగిపోయి నటించింది. షాహీ మహల్ వంటశాలలలో పని చేయడంతో పాటు అలామ్‌జేబ్‌కు ఆమె నమ్మకమైన స్నేహితురాలిగా ఉంటుంది. ఈ సిరీస్ లో సైమా (శ్రుతి శర్మ) ఇక్బాల్ (రజత్ కౌల్)తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి ఈ సిరీస్ చిత్రీకరణలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఈ సిరీస్‏లో రజత్ కౌల్‏తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశానని.. ఆ సన్నివేశాల్లో ఇద్దరం చాలా సహజంగా నటించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఏ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చేయలేదని తెలిపింది. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు చేస్తున్న సమయంలో తన శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు తెలిపింది. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక రోజంతా కష్టపడి ఆ సీన్స్ కంప్లీట్ చేశామని.. ప్రతి సీన్ బాగా వచ్చేవరకు షూటింగ్ చేశామని.. అందుకే ఈ వెబ్ సిరీస్‏లో ఆ సీన్స్ చాలా అద్భుతంగా పండాయని శ్రుతి చెప్పుకొచ్చింది. హీరామండి వెబ్ సిరీస్ లో సైమా పాత్ర చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. డైరెక్టర్ భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here