Lavanya tripathi : యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరు లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపుని దక్కించుకుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకి దూసుకుపోతున్న లావణ్య త్రిపాఠి, ఈమధ్య కాలం లో సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. దానికి కారణం వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవడమే. పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠి ని సినిమాలు చెయ్యడానికి అంగీకరించలేదని, అందుకే ఆమె కొత్త సినిమాలకు సంతకం చెయ్యడం లేదని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
పెళ్లి తర్వాత ఆమె నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ మాత్రమే విడుదలైంది. ఆ తర్వాత ఆమె నుండి ఎలాంటి వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ విడుదల కాలేదు. వరుణ్ తేజ్ విరామ సమయం లో లావణ్య అతనితో కలిసి విదేశీ ట్రిప్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దీంతో అభిమానులు లావణ్య త్రిపాఠి ఇక సినిమాలు చెయ్యదు అనే నిర్ధారణకు వచ్చేసారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే వరుణ్ తేజ్ లావణ్య ని మళ్ళీ సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడట. అంతే కాకుండా ప్రముఖ దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా వరుణ్ తేజ్ సంప్రదిస్తూ లావణ్య కోసం మంచి కథలను సిద్ధం చెయ్యమని కోరుతున్నాడట. ఇది లావణ్య త్రిపాఠి అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అయితే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చెయ్యాలని లావణ్య త్రిపాఠి నిర్ణయించుకుందట. అలాగే నటనకి ప్రాధాన్య ఉన్న క్యారక్టర్ రోల్స్ చెయ్యడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా లావణ్య కెరీర్ కోసం ఒక భర్త గా వరుణ్ తేజ్ తీసుకుంటున్న ప్రత్యేకమైన శ్రద్ధకి సోషల్ మీడియా లో మెగా అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాని విడుదల చేసాడు. ప్రస్తుతం ఆయన మట్కా అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కానుంది. చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్, మట్కా చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.