Anasuya : అభిమానులకు గుడ్ న్యూస్.. బుల్లితెరకు రీ ఎంట్రీ ఇస్తున్న అనసూయ.. ఏ ఛానెల్ అంటే ?

- Advertisement -

Anasuya : అందాల అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఏకంగా తొమ్మిదేళ్ల పాటు యాంకర్‌గా తన అందచందాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన ఈ అమ్మడు టీవీకి దూరమై పూర్తిగా సినిమాలకే పరిమితం అయింది. 2022 లో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పుష్ప మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుని వరుస అవకాశాలతో వెండితెర పై దూసుకుపోతుంది. మైఖేల్, ఖిలాడీ, రంగమార్తాండ, పెదకాపు, విమానం, ప్రేమ విమానం వంటి సినిమాల్లో విభిన్న పాత్రలలో నటించి అందరినీ మైమరిపించింది.

ప్రస్తుతం పుష్ప-2 లోనూ కీలక పాత్ర పోషిస్తోది. అంతేకాకుండా అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు రకాల పోస్టులతో నెట్టింట్లో తెగ రచ్చ చేసింది. కొన్నిసార్లు నెటిజన్ల చేత ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. అంతే కాకుండా నెట్టింట్లో అనసూయ వివాదాలకు లెక్కే లేదు. విజయదేవరకొండతో గొడవ గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, అనసూయ మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఓ రియాలిటీ గేమ్ షో చేయడానికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో స్టార్ మా చానెల్‌లో టెలికాస్ట్ అవ్వబోతున్న షోకు అనసూయ, బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్, విష్ణుప్రియ, శోభాశెట్టి, దీపిక పిల్లి, రీతూ చౌదరి, యాదమ్మ రాజు వంటి వారు హాజరయ్యారు.

- Advertisement -

anchor anasuya

ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. అందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీరియల్ నటీనటులతో కలిసి అదిరిపోయే స్టెప్పులతో స్టేజ్‌ దద్దరిల్లిపోయేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అనసూయ రీఎంట్రీతో టీవీలు దద్దరిల్లడం ఖాయం అని అంటున్నారు ప్రేక్షకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here