Pawan Kalyan : ‘ఒక్కడు’ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!

- Advertisement -

Pawan Kalyan : రీమేక్ అనేది కొత్త కాదు..తెలుగు, హిందీ , తమిళం , కన్నడ ఇలా అన్నీ భాషల్లో కూడా సూపర్ స్టార్స్ పాత తరం నుండి నేటి వరకు రీమేక్స్ లో నటిస్తూనే ఉన్నారు. ఒరిజినల్ స్క్రిప్ట్ చెయ్యడం కంటే కూడా రీమేక్ చెయ్యడం చాలా కష్టం. ఎందుకంటే ఒరిజినల్ లో నటించిన హీరో నటనని మ్యాచ్ చెయ్యడం అనేది కత్తి మీద సాము లాంటిది. నేటి తరం స్టార్ హీరోలలో అత్యధిక రీమేక్ చిత్రాలలో నటించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Pawan Kalyan
Pawan Kalyan

ఒకప్పుడు రీమేక్ చేసినా పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో రీమేక్ చెయ్యడం అనేది సాహసమే. కానీ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. ఆయన గత మూడు చిత్రాలు రీమేక్ చిత్రాలే, అందులో రెండు సూపర్ హిట్ అవ్వగా, ఈ ఏడాది విడుదలైన ‘బ్రో’ చిత్రం ఫ్లాప్ గా నిల్చింది.

Pawan Kalyan MOvies

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గతం లో మహేష్ బాబు ఒక్కడు సినిమాని రీమేక్ చేసాడు అంటే ఎవరైనా నమ్ముతారా..?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. గతం లో ఆయన తమిళ డైరెక్టర్ ధరణి తో ‘బంగారం’ అనే చిత్రం చేసాడు. బంగారం కి మరియు ఒక్కడు చిత్రానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ‘ఒక్కడు’ చిత్రం లో మహేష్ బాబు భూమిక కోసం ఎన్నో పోరాటాలు చేస్తాడు, ‘బంగారం ‘ చిత్రం లో కూడా అంతే, హీరోయిన్ మీరా జాస్మిన్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటాలు చేస్తాడు.

- Advertisement -
Pawan Kalyan Bangaram movie

ఈ రెండు సినిమాల కథాంశం లో లక్ష్యం ఒక్కటే, అప్పట్లో ‘బంగారం ‘ చిత్రాన్ని అందరూ ఒక్కడు సినిమాతో పోల్చేవారు. ఈ చిత్ర దర్శకుడు ధరణి తమిళం లో విజయ్ ని హీరో గా పెట్టి ఒక్కడు చిత్రాన్ని ‘గిల్లీ’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా అప్పట్లో తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తాలూకు ప్రభావం ధరణి పై చాలా బలంగా ఉంది, అందుకే ‘బంగారం’ చిత్రానికి కూడా అదే కథాంశం ని ఎంచుకున్నాడు. ఈ డైరెక్టర్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు, ఖాళీగానే ఉంటున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here