Guntur Kaaram ‘గుంటూరు కారం’ వివాదంపై క్లారిటీ

- Advertisement -

Guntur Kaaram ‘గుంటూరు కారం’ పాటల విషయంలో హీరో మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయడం దుమారం రేపుతోంది.
మాస్‌ సాంగ్‌పై మహేశ్‌ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్’కు ఆయన క్లాసు తీసుకున్నారు.
ప్రస్తుతం దాన్ని రీ వర్క్‌ చేస్తున్నారంటూ ఓ నెటిజన్ కోట్ చేశాడు. దీంతో నిర్మాత నాగవంశీ స్పందించారు.
మూవీలో మొత్తం 4 పాటలతో పాటు ఒక బిట్‌ సాంగ్‌ ఉందని, ఇప్పటికే 3పాటల షూటింగ్‌ సైతం పూర్తయిందన్నారు.
మిగిలిన పాట చిత్రీకరణ షెడ్యూల్‌ డిసెంబర్‌ 21 నుంచి ప్రారంభం కానుందన్నారు.
దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పాటల గురించి జరుగుతున్నది ఊహగానాలు మాత్రమేన్నారు.

ఇలాంటి ఫేక్ న్యూస్‌లకు వాళ్లు స్పందించరు

కేవలం పేరు కోసం, లైకుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తున్నారన్నారు.
మహేశ్‌ ఫ్యాన్స్‌ ఇలాంటి వార్తలకు స్పందిస్తారని రూమర్స్‌ సృష్టించే వాళ్లకు తెలుసని, ఇలాంటి ఫేక్ న్యూస్‌లకు చిత్ర బృందం స్పందించట్లేదంటే అవి నిజం కాదన్నారు.
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుంచి ఇటీవలే ఓ పాటను విడుదల చేశారు.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. మహేశ్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆడిపాడనున్నారు.
జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రనిర్మాణ బృందం ఇప్పటికే స్పష్టం చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here