Bigg Boss : రన్నర్ కి కూడా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్న బిగ్ బాస్..? ఎన్ని లక్షల్లో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ షో మొత్తం ‘ఉల్టా పల్టా’ అని హోస్ట్ నాగార్జున అన్ని సార్లు ఎందుకు అన్నాడో ఆడియన్స్ కి మొదట్లో అర్థం కాలేదు. గత సీజన్ అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈ సీజన్ పై ప్రేక్షకులు అంతగా అంచనాలు పెట్టుకోలేదు. ఆడియన్స్ లో ఆసక్తి క్రియేట్ అవ్వడానికి వంద చెప్తారు, కానీ అలాంటిది ఏమి ఉండదు అని అనుకున్నారు. కానీ సీజన్ ప్రారంభం అయ్యాక ప్రతీ ఎపిసోడ్, ప్రతీ వీకెండ్ లో ఇస్తున్న ట్విస్టులను చూసి ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యింది.

అంతే కాదు ముందు లాగ విన్నర్ ఎవరు అనేది అంత తేలికగా చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే ఈసారి అమర్ దీప్, ప్రశాంత్ మరియు శివాజీ ఈ ముగ్గురికి కూడా సరిసమానమైన గెలిచే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా పోల్స్ చూసుకుంటే విన్నర్ గా ప్రశాంత్ మరియు రన్నర్ గా అమర్ దీప్ నిలుస్తాడని తెలుస్తుంది.

అయితే ఇంతకు ముందు సీజన్స్ లో కేవలం విన్నర్ కి మాత్రమే క్యాష్ ప్రైజ్, ఫ్లాట్స్, కార్ వంటివి ఇస్తుండేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం రన్నర్ కి కూడా ప్రత్యేకంగా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారని టాక్. గత సీజన్ శ్రీహాన్ మరియు రేవంత్ టాప్ 2 కంటెస్టెంట్స్ గా నిలిచారు. కానీ చివర్లో నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ కి ఇచ్చిన భారీ మనీ ఆఫర్ ని శ్రీహాన్ ఒప్పుకోవడం తో విన్నర్ ప్రైజ్ నుండి కట్ చేసుకొని శ్రీహాన్ కి ఇచ్చారు.

- Advertisement -

కానీ ఈసారి అలా కాదంట, విన్నర్ క్యాష్ ప్రైజ్ నుండి ఒక్క రూపాయి కూడా తగ్గడట. ఈ సీజన్ గ్రాండ్ హిట్ అవ్వడం తో రన్నర్ కి కూడా ప్రత్యేకమైన ప్రైజ్ మనీ ఇవ్వాలని రీసెంట్ గానే బిగ్ బాస్ టీం నిర్ణయం తీసుకుందట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం పాతిక లక్షల రూపాయిల వరకు ప్రైజ్ మనీ రన్నర్ కి ఇస్తారని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here