Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధం.. హౌస్ లోకి వెళ్లేది వీళ్లే ?

- Advertisement -

Biggboss 8 : తెలుగు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసే రియాల్టీ షో బిగ్ బాస్. బుల్లితెర పై బిగెస్ట్ రియాలిటీ షోగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్.. ఇప్పటికే చాలా భాషల్లో ప్రసారం అవుతుంది. ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అయింది. తెలుగు భాషలో ఇప్పటికే బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు సిద్ధం అవుతుంది. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు భలే నచ్చింది. ఆ తర్వాత రెండో సీజన్ కు హీరో నాని హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ దక్కించుకోలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ బాధ్యతను అక్కినేని నాగార్జున తన భుజాల పై వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జునే ఏకధాటిగా హోస్ట్ గా చేసుకుంటూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామన్ మ్యాన్ గా హౌస్‌లోకి వెళ్లి రైతు బిడ్డ ట్యాగ్ వేసుకున్న పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విజేతగా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతోంది. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలు అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంది వీళ్లే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు దాదాపు వీరు కన్ఫర్మ్ అని చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతకూ ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?

- Advertisement -

హీరో రాజ్ తరుణ్, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, యూట్యూబర్ సోనియా సింగ్, నటి హేమ, నేత్ర, వంశీ, రీతూ చౌదరి, సురేఖ వాణి ( లేదా సుప్రీత), జబర్దస్త్ కమెడీయన్ కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, కుషిత కొల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వీరితో పాటు మరికొంతమంది కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ లోకి వెళ్తారని తెలుస్తోంది. మరి ఫైనల్ గా వీరిలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంటారో.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here