Big Boss : తల్లి పై ఫైర్ అయిన శోభా శెట్టి..బయట విషయాలు చెప్పడం లేదంటూ గొడవ!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ లో విలన్ క్యారక్టర్ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకున్న శోభా శెట్టి, ఆ పాపులారిటీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె తన తోటి కంటెస్టెంట్స్ తో అదే ఫైర్ బ్రాండ్ యాటిట్యూడ్ ని చూపిస్తూ ఇన్ని రోజులు వచ్చింది.

Big Boss
Big Boss

ఈ యాటిట్యూడ్ వల్లే ఆమె టాస్కులు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, ఆమెలో ఉన్న ఈ యాటిట్యూడ్ వల్ల సోషల్ మీడియా లో ఈమెపై నెగటివిటీ పీక్ రేంజ్ కి చేరుకుంది. రెండు వారల క్రితమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఈమెని ఉద్దేశపూర్వకంగానే స్టార్ మా టీం వాళ్ళు సేఫ్ చేస్తున్నారు అనే కంప్లైంట్ కూడా సోషల్ మీడియాలో ఉంది. ఇదంతా పక్కన పెడితే నిన్న ఆమె తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈమె ఎంటర్ అయ్యాక హౌస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ మామూలు రేంజ్ రాలేదు. అందరితో చాలా చక్కగా కలిసిపోయింది. ముఖ్యంగా యావర్ ని బాగా దగ్గరకి తీసుకుంది. ఈమె చేత యావర్ తల్లి ఫోటో ని ఇచ్చి పంపుతారు బిగ్ బాస్ టీం. అది చూసి యావర్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత శోభా శెట్టి తో ఏకాంతంగా మాట్లాడుతుంది. ప్రారంభం లో ప్రేమగానే మాట్లాడిన శోభా శెట్టి బయట విషయాల గురించి చెప్పమని వాళ్ళ అమ్మని అడుగుతుంది.

- Advertisement -

ఆమె చెప్పకుండా టాపిక్ మారుస్తూ మాట్లాడగా శోభా శెట్టి ఫైర్ అవుతుంది. నువ్వు బయట విషయాలు అసలు చెప్పడం లేదు, నా గురించి ఏమి అనుకుంటున్నారు , మిగతా వాళ్ళ గురించి ఎం అంటున్నారు, అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవేమి చెప్పడం లేదు ఎన్ని సార్లు అడిగిన అని ఆమె తల్లి పై ఫైర్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here