Sai Dharam Tej : యాక్సిడెంట్ తర్వాత ఇంకా ఆ సమస్యతో బాధపడుతున్న సాయిధరమ్ తేజ్

- Advertisement -

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. వారిద్దరు బ్రో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జులై 28న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అంతే కాకుండా యూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలు విడుదల అయ్యాయి. కానీ వాటిని చూసిన ప్రేక్షకులు కాస్తంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ మునుపటి డ్యాన్స్ మూమెంట్స్ కనిపించట్లేదు.

Sai Dharam Tej
Sai Dharam Tej

దీనిపై సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇది తనకు పునర్జన్మ లాంటిదన్నారు. ఈ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మందులు, ట్రీట్ మెంట్ వల్ల శరీరంలో కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు. ఇప్పుడు బ్రో సినిమాలో డ్యాన్స్ చూసి అభిమానులే కాదు తాను డిస్సపాయింట్ అయ్యానన్నారు. దానికి సాకులు చెప్పటం లేదని మునపటిలా డ్యాన్స్ వేయడానికి కాస్తంత టైం పడుతుందని తెలిపారు. యాక్సిడెంట్ తర్వాత కనీసం మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు తాను ప్రస్తుతం బయట పడ్డానని తెలిపారు. అసలు సమస్య యాక్సిడెంట్‌లో గాయాల వల్ల కాదు, కోమాలో ఉన్నప్పుడు తనకు స్టెరాయిడ్స్ ఇచ్చారు. వాటి ప్రభావం ఇప్పటికీ శరీరంపై ఉందన్నారు. దీంతో ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయినట్లు చెప్పారు. మళ్లీ ఆ ఫిట్ నెస్ సంపాదించాలి అంటే వర్కవుట్ చేయాలి. స్టెరాయిడ్స్, ఇతర మందులు కారణంగా చేయలేకపోతున్నానని.. త్వరలోనే మునపటి సాయి తేజ్ మీ ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here