అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‍లో నాలుగో సినిమా ప్రకటన వచ్చేసింది..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వీరి కాంబోలో వచ్చి, మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను కూడా రాబట్టాయి.. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హిట్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా ప్రకటన కూడా కొద్ది నిమిషాల ముందే వచ్చేసింది..

హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సారి వీరి కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. దీంతో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అల్లుఅర్జున్ 22వ సినిమాగా తెరకెక్కనుంది..

ఇకపోతే త్రివిక్రమ్ మహేష్ తో సినిమా, అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ కాంబోలో నాలుగోసారి హిట్ కి రెడీ అవుతున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. కాగా,త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా పూర్తి అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయనున్నట్లు సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here