Adah Sharma : అప్పుడు కుక్క ఇప్పుడు బల్లి.. ఏం ఆదాశర్మ నీకు మనుషులు పనికి రారా

- Advertisement -

Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన అద్భతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఈ భామ తెలుగులో వరుస సినిమాలు చేసింది. సినిమాలు సక్సెస్ అయినా ఈ భామకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ భామకు కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి. దీనితో ఈ భామ బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేస్తూ పాపులారిటీ దక్కించుకుంది . ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ యూనిక్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. అందం, అభినయం కలబోతగా నటనలో ప్రశంసలు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాను కుక్కలు, పిల్లులతో స్నేహం చేస్తూ.. మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది. రీసెంట్‌గా మిమిక్రీకి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేయగా.. తాజాగా ఓ ఫొటో సిరీస్ షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ శారీలో మెరిసిపోయింది. బల్లితో ఫ్రెండ్‌షిప్ గురించి వివరించింది. మనుషులు, జంతువులు నీరు తాగి బతుకుతాయి కానీ ఈ జీవి మాత్రం నీటిని ముట్టుకోకుండానే బతుకుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మనుషులు దొరక్కా బల్లితో రొమాన్స్ చేస్తున్నావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇటీవల దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఆయన పట్ల తనకున్న అమితమైన అభిమానాన్ని చాటుకుంది. జనాలు ఆయనను ఒక దెయ్యంగా ట్రీట్ చేస్తున్నారంటూ తెగ ఫీలైంది. ఇలాంటి వాళ్లను చూస్తే చిరాకు వేస్తుందని.. ఇంకెప్పుడు మారుతారోనని మండిపడింది. కనీసం ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలను అయినా గుర్తుంచుకుని మాట్లాడాలి కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here