Prashant varma : ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్లలో ఒకరు ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎంత వైవిధ్య భరితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకులు ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ.. రణ్ వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రణ్ వీర్ సింగ్ తో ఒక మైథాలజికల్ బ్యాక్ గ్రౌండ్లో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కాన్సెప్ట్ ను ఎంచుకున్నారట.
ఆ కథగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది . ఈ సినిమాకు “రాక్షస్” అనే టైటిల్ కూడా పెట్టారట. అయితే సడన్ గా ప్రశాంత వర్మ, రణ్ వీర్ సింగ్ మధ్య వచ్చిన క్లాషెస్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం.. అదంతా ఫేక్ అని రణవీర్ సింగ్తో ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదంటూ ..పొద్దున కూడా రణ్ వీర్ సింగ్ ప్రశాంత్ వర్మతో మాట్లాడాడు అని .. చిత్ర బృందానికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమాతో ఒక స్టార్ హీరోని టార్గెట్ చేసిన ప్రశాంత్ వర్మ అప్పటి నుంచి సోషల్ మీడియా హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఆ హీరో ఫ్యాన్స్..ఇప్పుడు..హెడ్ వెయిట్ కారణంగానే ప్రశాంత్ వర్మ ఖాతాలో నుంచి మంచి ప్రాజెక్ట్ ఎగిరిపోయిందంటూ… ఆయన దూల తీరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.