Pragya Jaiswal టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ భామ తెలుగు సినిమా తెరపై కనిపించి చాలా ఏళ్లవుతోంది. అయితే వెండితెరపై సందడి చేయకపోయినా.. అప్పుడప్పుడు బుల్లితెరపైనా.. ఇక రోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులకు టచ్లో ఉంటోంది. ఇక నెట్టింట తరచూ ఫొటోలు షేర్ చేస్తూ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
గ్రీన్ కలర్ పొట్టి గౌనులో ప్రగ్యా తన అందంతో మైమరిపించింది. క్యూట్ పోజులతో మెస్మరైజ్ చేసింది. కాస్త క్లీవేజ్ షో చేస్తూ తన అందాలను ఆరబోసింది. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలు చేసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంత అందాన్ని తెలుగు తెర మిస్ అయిపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున గారూ.. ఒక్కఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రగ్యాను మరోసారి తెలుగు తెరపై చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ భామ అభినయానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇక వరుస అవకాశాలతో ఈ బ్యూటీ బిజీ అవుతుందని అనుకుంటే ఈ భామకు అసలు అవకాశాలే రాలేదు. వచ్చినవి కూడా పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు కాదు.ఇక చివరగా ఈ భామ బాలకృష్ణతో కలిసి నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయింది. అలా ప్రగ్యా సినిమాల్లో కంచె తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా అఖండ అని చెప్పుకోవచ్చు.