Pushpa 2 ప్రస్తుతం సెట్స్ మీదున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప : ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్ ఒక్క రేంజ్ లో హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఇంస్టాగ్రామ్ రీల్స్ లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఆగష్టు 15 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై ఉండేది. కానీ షూటింగ్ చెయ్యాల్సిన సన్నివేశాలు 50 శాతం కి పైనే బ్యాలన్స్ ఉండడం, అంతే కాకుండా తీసిన సన్నివేశాలు కూడా మరోసారి రీ షూట్ చెయ్యాల్సిన పరిస్థితి రావడం తో మేకర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 6 వ తేదికి వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ సుకుమార్ కోపానికి అల్లు అర్జున్ సైతం షాక్ కి గురి అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే సినిమాలో నటించే నటీనటులు ఎక్కువ టేకులు తీసుకోవడం వల్ల అసహనంపై గురై డైరెక్టర్ సుకుమార్ తన ఐ ఫోన్ ని విసిరికొట్టి షూటింగ్ స్పాట్ నుండి వైదొలిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా కూడా నటీనటులు సరిగా నటించకపోవడం, తీసిన సన్నివేశాలని మళ్ళీ మళ్ళీ రీ షూటింగ్ చెయ్యడం తో సుకుమార్ లో తీవ్రమైన అసహనం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఆ కారణం చేతనే ఆయనే ఇలా ప్రవర్తించాడట.
ఎప్పుడూ నవ్వుతు జోకులు వేస్తూ ఉండే సుకుమార్ లో ఒక్కసారిగా అంత కోపాన్ని చూసి అల్లు అర్జున్ సైతం షాక్ కి గురైనట్టు తెలుస్తుంది. మన అందరికీ తెలిసిందే సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని ఎంతో సమయం తీసుకొని రాజమౌళి లాగ చెక్కుతాడు అని. అందుకే ఆయన సినిమాలు విడుదల అయ్యేందుకు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అయ్యినప్పటికీ కూడా హీరో ఇమేజి పదింతలు పెంచే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.