Niharika : ఎన్నిలక ఫలితాల రోజు పవన్ కళ్యాణ్ గెలుపును బుల్లితెరపై చూసేందుకు జనాలంతా టీవీలకు అతుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఇటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పిఠాపురంలోని ఇంట్లో హాజరయ్యారు. కానీ ఇందులో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. అదేవిధంగా పవన్ గృహప్రవేశం సమయంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అల్లు కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో మెగా కజిన్ సాయి ధరమ్ తేజ్ ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్లో అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల తాజాగా స్పందించారు.
యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సొంత బ్యానర్లో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు అందరూ కొత్త నటులతో ఈ చిత్రం తెరెకెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది.. త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్లో టీజర్ని విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ వేడుకకు నిహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ వివాదం పై ఆమె స్పందించారు.
ఈ విషయం గురించి ఒక విలేకరి నిహారికను ప్రశ్నించగా.. అల్లు అర్జున్, సాయి తేజ్ విషయం గురించి తనకు తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. సినిమా గురించి మాట్లాడుతూ… ‘ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని చూసినట్టుగా అనిపించింది. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి’ అని నిహారిక అన్నారు. ఇది ఇలా ఉంటే ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రెడ్డికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం అల్లు అర్జున్ను మెగా హీరో సాయి తేజ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. దాంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.