Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను గెలిచి 100శాతం సక్సె్స్ రేటుతో గెలిచింది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ 69వేల పైగా మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఈ విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులతో పాటు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ను సాధించడమే కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతులకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ విడిపోయిన తర్వాత పిల్లలు రేణు దేశాయ్ తోనే ఉంటున్నారు. అయితే ఇక పవన్ కళ్యాణ్ పిల్లల్ని చూడాల్సిన ప్రతిసారి మహారాష్ట్రకు వెళ్లి వాళ్లను కలిసి వస్తుంటారు.
అయితే రేణు దేశాయ్.. అకీరా నందన్ తో ఇంట్లో తెలుగులో మాట్లాదుతుందట.. కానీ ఆద్యతో మాత్రం మరాఠీలో మాట్లాడుతుందట. ఇక పవన్ కళ్యాణ్ ఆద్యను కలిసినప్పుడు కూతురితో మాట్లాడటానికి మరాఠీ నేర్చుకున్నాడట. కేవలం 30 రోజుల్లోనే దాదాపు 80శాతం మరాఠీ మాట్లాడటం నేర్చుకున్నాడట.. పవన్ కళ్యాణ్ తన కూతురు అంటే తనకి ఎంత ఇష్టమో ఈ రకంగా తెలియజేశాడని చాలామంది పొగిడేస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికినా ప్రతీసారి పిల్లలతో కూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.