Jagapathi Babu : జగపతిబాబు ఈ పేరుతో పెద్దగా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. శోభన్ బాబు తర్వాత అందగాడు అనే ముద్ర వేయించుకున్నారు. ఇద్దరు హీరోయిన్లతో అత్యధిక సినిమాలు తీసే హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ గా జగపతిబాబు నిలిచారు. మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొని తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆయన ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్సులు అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన.. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను మోసపోయానని.. రియల్ ఎస్టేట్ రంగాల్లో జరుగుతున్న మోసాల పై జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
దానికి నేను బాధితుడినయాను అని ఆవేదన వ్యక్తం చేసిన జగపతిబాబు.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక జగపతి బాబు మాట్లాడుతూ.. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నేను నటించాను. అయితే వాళ్లు నన్ను మోసం చేశారు. వాళ్లు ఎవరు.. అసలు ఏం జరిగింది.. అనే వివరాలను త్వరలోనే బయటపెడతాను. భూమి కొనే ముందు కాస్త రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ తెలుసుకోండంటూ ఆయన వివరించాడు.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో జగపతిబాబు దూసుకుపోతున్నారు. పాన్ ఇండియన్ మూవీ పుష్ప2, మిస్టర్ బచ్చన్ సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక జగపతిబాబు కామెంట్స్ వైరల్ గా మారడంతో.. స్టార్ స్టేటస్ ఉన్న జగపతిబాబు లాంటి వారే రియల్ ఎస్టేట్ ఊబిలో చిక్కుకుపోయారంటే… సామాన్యుల పరిస్థితి ఏంటి.. వారికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు… వీటిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.