Jr NTR : ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం వరుష షూటింగులతో బిజీబిజీగా ఉన్నాడు. దేవర, వార్ 2 సినిమాలతో క్షణం కూడా గ్యాప్ లేకుండా షూటింగులలో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ తరచూ బయట, ఎయిర్ పోర్ట్స్ లో కనిపిస్తుండటంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతోంది. ఈ మధ్య తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఇటీవల శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆ ఆలయానికి నిర్మాణ నిమిత్తం భారీ విరాళం ఇచ్చారని సమాచారం. 12 లక్షల 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలుస్తుంది. గుడి బయట దాతల పేర్లను రాళ్లపై పేర్లు రాయించగా ఎన్టీఆర్, భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు విరాళం ఇచ్చినట్టు రాశారు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలోనూ, ఏదైనా మంచి కార్యానికి విరాళం ఇవ్వడంలోనూ ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. ఎన్టీఆర్ ఏకంగా అంత డబ్బు ఓ ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడంతో అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు దేవర, వార్ 2 సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న మొదటి సాంగ్ విడుదల కానుంది.