Meenakshi Chowdary : ఆమె అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది. మంచిగా నటిస్తుంది కూడా. కానీ సరైన అవకాశాలే రావడం లేదు. తను ఇంకెవరో కాదండోయ్.. మీనాక్షి చౌదరి. సంక్రాంతి పండక్కి రిలీజైన గుంటూరు కారంలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్గా నటించింది. అయినా ఇద్దరి మధ్య మంచి సీన్స్, సాంగ్స్ పడకపోవడంతో అభిమానులు హర్టయ్యారు. తాజాగా ఈ బ్యూటీ ట్రాక్లో పడ్డట్లే అనిపిస్తుంది.
వరుసగా అవకాశాలు వస్తున్నాయి మీనాక్షికి. దళపతి విజయ్ నటిస్తున్న.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లక్కీ భాస్కర్ అనే మూవీ కూడా చేస్తోంది. మెగా హీరో వరుణ్ తేజ్తో మట్కాలో నటిస్తోంది. తాజాగా ఈమె మరో క్రేజీ ఆఫర్ పట్టినట్లు టాక్ నడుస్తోంది. ‘సైంధవ్’ సినిమాతో అదరగొడతాడనుకున్న వెంకటేష్.. నిరాశపరిచాడు. అయినా లేట్ చేయకుండా తన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు వెంకీ.
ఉగాది నాడు అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారనటి టాక్. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ది గోట్, లక్కీ భాస్కర్ సినిమాల షూటింగ్తో బిజీగా ఉంది మీనాక్షి. త్వరలోనే వెంకీ-అనిల్ రావిపూడి చిత్ర షూటింగ్ కూడా మొదలయ్యే చాన్స్ ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఇవ్వబోతున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.