Chiranjeevi : చిరంజీవికి చెల్లెళ్లను తీసుకురాలేకపోతోన్న దర్శకుడు.. పీకల్లోతు కష్టాల్లో ‘విశ్వంభర’..!

- Advertisement -

Chiranjeevi : చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ ఎలిమేమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియోకి ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో విశ్వంభర సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ ట్రెండ్ అవుతోంది అదేంటంటే..

ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటారట. వారిలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లు ఉన్నారని సమాచారం. అయితే ఇక్కడే విశ్వంభర టీమ్ కి ఓ సమస్య వచ్చిపడిందట. అదేంటంటే.. చిరంజీవి చెల్లెళ్లకి జోడీలు దొరకడం కష్టంగా మారిందట. లిస్టులో రాజ్ తరుణ్, సుశాంత్ లాంటి హీరోలు ఉన్నప్పటికీ.. ఫైనల్‌గా ఎవరు సెట్ చేయాలనేది ప్రశ్నార్థకంగా మారిందట. దీంతో చిరంజీవికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెగాస్టార్ కుక్ జోడీగా చెన్నై చిన్నది త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.

chiranjeevi 157

ఇటీవలే ఈ అమ్మడు విశ్వంభర సెట్స్ లో అడుగుపెట్టింది. స్టాలిన్ సినిమా తరువాత ఇన్నాళ్ళకి ఈ జోడీ విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోట కె నాయుడు కెమెరామెన్ గా చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here