NTR : ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఆయనకు జనాల్లో ఎలాంటి ప్రత్యేక గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఇప్పటికీ కోట్లాదిమంది తెలుగు జనాల హృదయాల్లో ఆయన ఇప్పటికీ నిలిచే ఉన్నారు. అలాంటి ఓ చెరగని ఘనతను అందుకున్నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అన్నా అన్న పిలుపు ఆయన చూసే పుట్టిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనను అందరూ అన్నా.. అన్నా అంటూ ప్రేమగా పిలుచుకునే వాళ్లు.

సినిమా ఇండస్ట్రీలో నైనా రాజకీయాల్లోనైనా ఆయనే నంబర్ వన్. పార్టీ పెట్టిన తొమ్మిది నెల్లలో అధికారంలోకి వచ్చి బడుగు జీవుల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి. అతి తక్కువ కాలంలో కొత్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరుదైన ఘనతను ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. మరీ ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం కూడా లేకపోలేదు . ఆయన ఆడవాళ్లలో తల్లిని చెల్లిని చూసుకుంటారు. ఆడవాళ్ళను బాగా గౌరవించే ఎన్టీఆర్.. మహానటి సావిత్రిని ఓ విషయంలో లాగిపెట్టి కొట్టారన్న వార్త అప్పట్లో సంచలనంగా మారింది.

మనకు తెలిసిందే నటి సావిత్రి మల్టీ టాలెంటెడ్. కానీ ఎందుకో జెమినీ గణేషన్ విషయంలో తప్పుడు అడుగులు వేసింది. ఆ కారణంగానే జీవితంలో కోలుకోలేని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. కాగా సావిత్రి జెమినీ గణేషన్ చేతిలో మోసపోయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమెను లాగిపెట్టి కొట్టారట. జీవితం విలువ తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేసుకోకూడదు అంటూ జ్ఞానోదయం కలిగించేలా మాటలు చెప్పారట. అయినా కానీ సావిత్రి ఆ మూమెంట్ వరకే అలా ఉండింది. మళ్లీ మద్యానికి బానిస అయిపోయి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది అంటూ అప్పట్లో మాట్లాడుకునే వారు.