Charmy Kaur : దేవుడి ముందు అందాల ఆరబోత..తెలుగు సినిమా పరువు తీసేసిన హీరోయిన్ ఛార్మీ!

- Advertisement -

Charmy Kaur అనుకున్న రేంజ్ లో భారీ సక్సెస్ లు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు ఛార్మీ. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యినవి చేతి వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు, అంత తక్కువ ఉంటాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొచ్చిన ఛార్మీ, ‘జ్యోతి లక్ష్మి’ సినిమా తర్వాత ఆమె నటనకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసి కేవలం నిర్మాతగా నిల్చింది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఆమె గత పదేళ్లు గా సినిమాలను నిర్మిస్తూ ఉంది. వీళ్ళు నిర్మించిన సినిమాలలో కేవలం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత తీసిన ‘లైగర్’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అవ్వగా, రీసెంట్ గా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే గతం లో ఛార్మీ ఏ హీరోయిన్ కూడా చెయ్యని సాహసం ఒకటి చేసింది. దాని వల్ల ఆమె ఎన్నో విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో ఆమె కృష్ణ వంశీ దర్శకత్వం లో ‘శ్రీ ఆంజనేయం’ అనే చిత్రం చేసింది. ఇందులో నితిన్ హీరో గా నటించాడు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి చాలా బాగుందే, ఎందుకు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది.

- Advertisement -

అందుకు ప్రధాన కారణం ఛార్మీ అందాల అరోబోతలే అని అంటూ ఉంటారు. లక్షణంగా దేవుడి పేరు, దేవుడి నేపథ్యం ఉన్న సినిమాలో ‘పూల గుమగుమలు చేరని’ లాంటి పాటలు పెడుతారా?, అందులో అందాలను అలా ఆరబొయ్యడానికి ఛార్మీ కి, తీసిన డైరెక్టర్ కృష్ణ వంశీ కి సిగ్గు లేదు అంటూ అప్పట్లో బాగా తిట్టారు జనాలు. కేవలం ఛార్మీ హద్దులు దాటినా ఎక్స్ పోజింగ్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని అంటుంటారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here