Anushka : అనుష్కకి ఘోర అవమానం.. తగిన శాస్తి జరిగిందంటూ మండిపడుతున్న ఫ్యాన్స్

- Advertisement -


Anushka : అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో నాగార్జున సరసన టాలీవుడ్ కు పరిచయం అయింది అనుష్క. కెరీర్ మొదట్లో పూర్తి గ్లామర్ పాత్రలకే పరిమితం అయింది. ఎప్పుడైతే అరుంధతి సినిమాలో నటించిందో ఆ సినిమాతో అనుష్క తలరాతే మారిపోయింది. జనాల గుండెల్లో జేజేమ్మగా గుర్తుండి పోయింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు అనుష్క శెట్టి పలువురు బడా హీరో సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్ గా మారింది.

ఓ పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. మరోపక్క ఈ జనరేషన్ కి నచ్చే రొమాంటిక్ సినిమాలు రెండిటిని సరి సమానంగా నటిస్తూ బిజీ అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో అనుష్క శెట్టి కెరీర్ ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిశ్శబ్దం తర్వాత దాదాపు మూడేళ్ల పాటు స్క్రీన్ పై కనిపించలేదు . ఆ తర్వాత ఆమె నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా టాక్ ప్రకారం బాగా పాజిటివ్ కామెంట్స్ అందుకుంది. సినిమాలో కామెడీ కూడా బాగా పండింది .

నవీన్ పోలిశెట్టి పర్ఫామెన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమైంది. ఈ సినిమాకి పరమ చెత్త టీఆర్పీ వచ్చిందట. స్టార్ హీరోయిన్ అయిన అనుష్క సినిమాకు కేవలం 3.2 రావడం ఆమెకు ఘోర అవమానం అని అంటున్నారు జనాలు. మరొక పక్క అభిమానులు కూడా తనకు తగిన శాస్తి జరిగిందని మండిపడుతున్నారు. అనుష్క శెట్టి కెరియర్ పరంగా బ్రేక్ తీసుకోకూడదని.. తీసుకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. అనుష్క కంటిన్యూగా సినిమాలు చేస్తేనే రేటింగ్ బాగా వస్తాయంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా అనుష్క వారి సలహాలు స్వీకరించి వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here