Mahesh Babu : వివాదంలో గుంటూరు కారం పాట.. అదో చెత్త పాట అంటూ మహేష్ ఫ్యాన్స్ రచ్చ..

- Advertisement -

Mahesh Babu : మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఓ వైపు సినిమా ప్రమోషన్లు.. మరోవైపు సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా యూనిట్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై రామజోగయ్య శాస్త్రి ఫైర్ అయ్యారు. నెటిజన్ పోస్టుకి ఆయన ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతోంది. గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mahesh Babu
Mahesh Babu

ఇప్పటికే ఈ సినిమా నుండి ‘దమ్ మసాలా’ అనే సాంగ్ రిలీజ్ చేసి దుమ్ము రేపిన మేకర్స్ తాజాగా ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటని శిల్పారావు పాడారు. ఇంకా ఈ సినిమాలో మరో రెండు పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ‘ ఇది నిదర్శనం అంటూ వరస్ట్ లిరిక్స్, వరస్ట్ మ్యూజిక్ అండ్ బీట్స్, ఓవర్ యాక్టింగ్ కేండిడేట్, అసలు ఎటువెళ్లిపోతుందో తెలియని గుంటూరు కారం…అని రాస్తూ రామజోగయ్య శాస్త్రిని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ని, నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. నెటిజన్ పోస్టుపై రామజోగయ్య శాస్త్రి మండిపడ్డారు.

Oh My Baby

సోషల్ మీడియాలో కుక్కలు తిరుగుతున్నాయి.. కొంతమందికి నిజంగా ఇక్కడ జరిగే ప్రక్రియ గురించి తెలియదు.. మనసులో దురుద్దేశం పెట్టుకుని తమ కామెంట్లతో ప్రతీది జడ్జ్ చేస్తారు.. టెక్నీషియన్లను టార్గెట్ చేస్తారు.. ఇది అస్సలు మంచిది కాదు.. ఎవరో ఒకరు మాట్లాడాలి.. గీత దాటుతున్నారు వీళ్లు..’ అంటూ రిప్లై చేశారు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పెట్టిన రిప్లై వైరల్ అవుతోంది. గతంలో కూడా రామజోగయ్య శాస్త్రి తన పాటలపై నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here