Pallavi Prashanth: దమ్ముంటే నిజాయితీగా గెలవండి అంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసిరిన తేజస్విని!

- Advertisement -

Pallavi Prashanth : సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కామన్ మెన్ మరియు రైతు బిడ్డ ట్యాగ్ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నట్టు ప్రశాంత్ కామన్ మెన్ అయితే కాదు. మొదటి నుండి అతనికి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో మరియు సీరియల్స్ లో లేకపోయినా కూడా ‘రైతు బిడ్డ’ ట్యాగ్ తో ఇతను చేసిన వీడియోస్ కి సోషల్ మీడియాలో మంచి రీచ్ రావడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సీరియల్ కంటెస్టెంట్స్ అందరికంటే ముందుగానే మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు.

హౌస్ లోకి అడుగుపెట్టకముందే తనకి 50 కి పైగా ఫ్యాన్ పేజీలు మరియు టీం ఉంది అనే విషయాన్నీ స్వయంగా ప్రశాంత్ ఒకసారి ఒప్పుకున్నాడు. అదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రశాంత్ ఫ్యాన్స్ మరియు అతని పీఆర్ టీం అమర్ దీప్ భార్య తేజస్విని ని ఒక రేంజ్ లో టార్గెట్ చేసారు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి తేజస్విని పోస్టులను చూస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ మరియు అతని పీఆర్ టీం ఆ అమ్మాయిని ఏ రేంజ్ లో టార్గెట్ చేసారో అర్థం అవుతుంది. పాపం అమర్ దీప్ బయటకు వచ్చి ఆ కామెంట్స్ చూసాక చాలా బాధపడుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ పీఆర్ టీం ఏ రేంజ్ లో దిగజారిపోయింది అంటే తేజస్విని తన భర్త అమర్ దీప్ కి ఓటు వెయ్యండి అంటూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ని పల్లవి ప్రశాంత్ కి ఓటు వేయాల్సిందిగా ఆమె కోరినట్టు ఎడిట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.

- Advertisement -

ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో తేజస్విని కంట కూడా పడింది. గెలవడానికి ఇంత చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారా?, దమ్ముంటే నిజాయితితో గెలవండి అంటూ పల్లవి ప్రశాంత్ పీఆర్ టీం కి ఛాలెంజ్ చేసింది. కేవలం ఈ ఒక్క వీడియో విషయం లోనే కాదు, ఎన్నో విషయాల్లో తేజస్విని చాలా తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here