Dil Raju : చిరంజీవి మాటని లెక్క చెయ్యనందుకు 25 కోట్ల రూపాయిలను నష్టపోయిన దిల్ రాజు!

- Advertisement -

Dil Raju : టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ నిర్మాతగా కొనసాగుతున్న వారిలో దిల్ రాజు నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. ఈయన ప్రొడక్షన్ కంపెనీ నుండి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే ముద్ర పడిపోతుంది. ఆ స్థాయి బ్రాండ్ వేల్యూ ని ఏర్పాటు చేసుకున్నాడు దిల్ రాజు. ముఖ్యంగా కథలను జడ్జి చేసే విషయం లో దిల్ రాజుని మించిన నిర్మాత టాలీవుడ్ లోనే లేరని అందరూ అంటూ ఉంటారు.

Dil Raju
Dil Raju

కానీ చిరంజీవి విషయం లో మాత్రం ఆయన లెక్క తప్పింది అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అసలు విషయానికి వస్తే అప్పట్లో దిల్ రాజు రామ్ చరణ్ తో ‘జోష్’ చిత్రాన్ని చెయ్యాలని అనుకున్నాడట. ఇది రామ్ చరణ్ మొదటి చిత్రం గా తియ్యాలని దిల్ రాజు చాలా కలలు కన్నాడట.

Dil Raju Ram charan

అయితే అప్పట్లో ఆయన చిరంజీవి ని కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించిన తర్వాత కథలో చాలా లోపాలు ఉన్నాయి, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాడట. లేదు సార్ కచ్చితంగా చరణ్ కి సరిపోతుందని దిల్ రాజు ఒప్పించే ప్రయత్నం చేసాడట. ఒక్కసారి నాగబాబు కి ఈ కథని వినిపించి అతని ఫైనల్ నిర్ణయం తీసుకో అని చిరంజీవి చెప్పడట. నాగబాబు కూడా చిరంజీవి చెప్పినట్టే చెప్పడం తో, ఇదేంటి ఇంత మంచి కథలో ఏమి లోపాలు కనిపించాయి వీళ్లకు అని మనసులో అనుకుంటూ వెళ్ళాడట.

- Advertisement -
Josh

అప్పుడే నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య ని లాంచ్ చెయ్యడానికి కథలు వింటూ ఉన్నాడు. అలా దిల్ రాజు వద్ద జోష్ స్టోరీ వినడం వెంటనే ఓకే చెప్పి నాగ చైతన్య తో ఈ సినిమా చేసాడు. ఫలితంగా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యి పాతిక కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించిందట. అలా చిరంజీవి మాట కాదు అన్నందుకు నాకు ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here