Bigg Boss Telugu : శివాజీ లేకపోతే ప్రశాంత్ సున్నా అని మరోసారి రుజువు అయ్యింది.. కెప్టెన్ గా మొదటి రోజే డిజాస్టర్!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు బిడ్డ గా పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. సామాన్యుడే కానీ, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఇంస్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఆ క్రేజ్ తో ఎంటర్ అయినా ప్రశాంత్ కి ప్రేక్షకులు ఒక రేంజ్ లో సపోర్టు చేసారు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ అప్పుడు అందరూ ప్రశాంత్ కి ఎక్కువగా మద్దతు తెలిపారు. సోషల్ మీడియా సపోర్టు కూడా ప్రశాంత్ కి ఎక్కువ ఉన్నింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ సపోర్టు లేకపోతే, అసలు ప్రశాంత్ ఇంత దూరం వచ్చేవాడే కాదని నిన్న జరిగిన ఒక సంఘటన చూస్తే అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఇంటికి మొదటి కెప్టెన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

Pallavi Prashanth

బిగ్ బాస్ హౌస్ రూల్స్ ప్రకారం వీఐపీ రూమ్ కేవలం కెప్టెన్ కి మాత్రమే. కానీ ప్రశాంత్ మాత్రం వీఐపీ రూమ్ ని అలా ఫ్రీ గా వదిలేసాడు. దీంతో కంటెస్టెంట్స్ లోపలకి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. లోపల ప్రత్యేకంగా ఉన్న ఫ్రిడ్జ్ లో ఉన్న స్ప్రైట్ బాటిల్స్ ని తీసుకొని త్రాగేస్తున్నారు. ప్రశాంత్ వాళ్ళని ఆపకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇది కూడా శివాజీ చెప్తే కానీ ఆయనకీ బిగ్ బాస్ రూల్స్ గుర్తుకు రావేమో.

- Advertisement -
shova balaji

ఇదంతా చూస్తుంటే గౌతమ్ చెప్పినట్టుగానే శివాజీ అన్న ఏది చెప్తే అది చెయ్యకుండా, నీకంటూ ఒక సొంత నిర్ణయం తో ముందుకు సాగిపో అని ఎందుకు అన్నాడో అర్థం అవుతుంది. కేవలం రైతు బిడ్డ అనే ట్యాగ్, మరియు శివాజీ సపోర్టు మీద బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకొని వస్తున్నాడని, వాస్తవానికి హౌస్ లో ఉన్న అందరికంటే వీక్ కంటెస్టెంట్ ప్రశాంత్ అని అంటున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here