అనుష్కతో సినిమా.. పాపం విడుదలకు ముందే ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన నవీన్ పొలిశెట్టి..

- Advertisement -

తాను నటించిన కొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రీకరణకు అధిక సమయం పట్టిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల విడుదల ఆలస్యం అయిందని, ఆ తప్పు జరిగినందుకు తమను మన్నించాలని నటుడు నవీన్‌ పొలిశెట్టి ప్రేక్షకులను కోరారు. ఎప్పుడో విడుదలకావాల్సిన సినిమా ఆలస్యమై వారిని నిరాశకు గురిచేసిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు.

అనుష్క
అనుష్క

నవీన్‌ హీరోగా దర్శకుడు పి. మహేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. అనుష్క శెట్టి కథానాయిక. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానుల్ని కలిసిన నవీన్‌.. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనదైన శైలి కామెడీతో అభిమానుల్ని అలరించారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం.

Miss Shetty Mr Polishetty
Miss Shetty Mr Polishetty

దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమిది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి’’ అని తెలిపారు. ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌, చెఫ్‌గా అనుష్క సందడి చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ (2021) తర్వాత నవీన్‌, ‘నిశ్శబ్దం’ (2020) తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇదేకావడంతో ఇరువురి అభిమానులు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here