జాన్వీ ఎప్పుడూ తిరుపతి వెళ్లడానికి వెనుక ఇంతపెద్ద కారణం ఉందా..!

- Advertisement -

దివంగత తార అతిలోక సుందరి శ్రీ దేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆమె నటించిన పలు చిత్రాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆమెకు మాత్రం గుర్తింపు దక్కలేదు. కానీ ఇటీవల కాలంలో ఆమె నటించిన బావాల్ చిత్రం హిట్ అవడంతో ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఈమెకు బాలీవుడ్లో మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ లో నటించాలని కోరిక ఉంది.

Janhvi Kapoor Emotional note on her mom sridevi
Janhvi Kapoor Emotional note on her mom sridevi

పైగా అది ఆమె తల్లి కోరిక. ఇదే కాకుండా తెలుగులో నటించడం అంటే ఆమెకి ఎప్పటి నుంచో కోరిక ఉంది. కానీ మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన మాత్రమే నటించాలని తన తల్లి గారి కోరిక మేరకు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. వదులుకొని ఎన్టీఆర్ తో అవకాశం రావాలనే ఎదురుచూసి మరి ఎన్టీఆర్ తో దేవర చిత్రం లో ప్రస్తుతం నటిస్తుంది. ప్రతి మూడు నెలలకి ఒక సారి జాన్వి కపూర్ కచ్చితంగా తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది. అసలు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వెళ్లడానికి గల కారణం ఏంటి అని ప్రస్తుతం నెట్టింటే వార్తలు అయితే వైరల్ అవుతుంది. ఇక జాన్వి కపూర్ ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు మూడు నాలుగు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి జాన్వీ కపూర్ వెళ్లినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక తరచూ తిరుపతి వెళుతుండడంతో జాన్వి కపూర్ అసలు తిరుపతి ఎందుకు వెళ్తుంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జాన్వి అభిమానులే కాకుండా నేటిజన్స్ సైతం అసలు విషయం ఏంటి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ దేవి కి చాలా ఇష్టమట.. ఇదే కాక తను ఏదైనా పనిని తలపెట్ట దలుచుకున్నప్పుడు కచ్చితంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ విషయం గురించి ముందుగా ఆయనకు చెప్పిన తర్వాతనే ఆ పనిని మొదలుపెడుతుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here