బెడ్ రూమ్ నిండా ఆ హీరో ఫోటోలను నింపేసినా హీరోయిన్ సాయి పల్లవి.. మరీ ఇంత పిచ్చా!

- Advertisement -

టాలీవుడ్ లో హీరోలతో సరిసమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఢీ అనే డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళం లో ‘ప్రేమమ్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎంత ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

సాయి పల్లవి
సాయి పల్లవి

ఈ సినిమా తర్వాత శేకర్ కమ్ముల ఈమెని ‘ఫిదా’ చిత్రం లో తీసుకున్నాడు. ఈచిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ , ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొట్టి ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. అందాల ఆరబోతకు దూరంగా , కేవలం నటన, డ్యాన్స్ తోనే ఆమె నేడు ఈ స్థాయి క్రేజ్ ని సంపాదించుకుంది, అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని ప్రేమగా పిలుస్తారు.

అయితే ఈమె ప్రతీ సినిమాకి తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది , ఏ హీరో తో కూడా స్నేహం చెయ్యదు , ఒకవేళ స్నేహం చేసిన అది ఆ సినిమా వరకే ఉంటుంది. అందుకే సాయి పల్లవి ని అందరూ అంతలా ఇష్టపడుతారు. అయితే ఈమె కూడా ఒక హీరో ని అమితంగా ప్రేమించిందట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. చిన్న తనం నుండి ఆయన అంటే పిచ్చి అట.

- Advertisement -

ఎంత పిచ్చి అంటే ఇప్పటికీ కూడా ఆమె బెడ్ రూమ్ మొత్తం రజినీకాంత్ ఫొటోలతో నింపేసి ఉంటుందట. అలా ఒక అభిమానిగా రజినీకాంత్ ని ప్రేమిస్తూనే ఉంటానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి కి రజినీకాంత్ తో కలిసి నటించే అవకాశం రాలేదు. ఒకవేళ వస్తే ఆమె ఏ రేంజ్ లో సంతోషిస్తుందో ఊహించుకోవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com